Pawan Kalyan: ఆ మూడు ఛానెళ్లని నడుపుతున్నదెవరు?: పవన్ కల్యాణ్

  • వారం రోజులుగా మీడియాపై మండిపడుతున్న పవన్ 
  • ట్విట్టర్ లో ట్వీట్లమీద ట్వీట్లు పెడుతున్న జనసేనాని
  • ఆ మూడు ఛానెళ్లు ఎవరివంటూ ప్రశ్న

గత వారం రోజులుగా మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ఒకదాని తర్వాత మరొకటిగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఉదయం మనలను తిట్టే టీవీలు, పేపర్లను ఎందుకు చూడాలని ప్రశ్నించిన ఆయన... తాజాగా, 'ఆ మూడు టీవీ ఛానెళ్లను నడుపుతున్నదెవరు?... ఈ భావోద్వేగపు అత్యాచారాల (ఎమోషనల్ రేప్) నుంచి కాపాడేందుకు ఎలాంటి నిర్భయ చట్టం అవసరం?' అంటూ ప్రశ్నించారు.   

More Telugu News