RAPE: 14 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల బీజేపీ మద్దతుదారుడైన వ్యాపారి అత్యాచారం!

  • ఫామ్ హౌస్ లో ఫిబ్రవరి 11న తొలిసారి అత్యాచారం
  • నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడి, మళ్లీ రావాలన్న వ్యాపారి 
  • స్నేహితురాలికి చెప్పడంతో పోలీస్ ఫిర్యాదు 

14 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల బీజేపీ మద్దతుదారుడైన వ్యాపారి అత్యాచారానికి పాల్పడడం త్రిపురలో కలకలం రేపింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... త్రిపురలోని ఖోవాయి జిల్లా తెలియమురాకు చెందిన మనోజ్ డెబ్ (54) పలు వ్యాపారాలు నిర్వహిస్తూ, బీజేపీ నేతగా ప్రచారం చేసుకుంటాడు. గత ఫిబ్రవరి 11న ఛంప్లాయ్‌ లోని తన ఫామ్‌ హౌస్‌ లో మైనర్ బాలిక (14) పై తొలిసారి అత్యచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు.

దీంతో భయపడ్డ బాలిక నిస్సహాయతను ఆసరాగా తీసుకుని ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆమెపై అత్యాచారకాండ సాగించాడు. గతవారం మళ్లీ ఫామ్‌ హౌస్‌ కు రావాలని హుకుం జారీ చేయడంతో బాధితురాలు జరిగిన ఘోరాన్ని తన స్నేహితురాలికి వివరించింది. స్నేహితురాలి ప్రోత్సాహంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఖోవాయి ఎస్పీ మాట్లాడుతూ, మనోజ్ డెబ్ పెద్ద వ్యాపారవేత్త అని, అతనిపై పోక్సో చట్టంకింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించామని తెలిపారు. 

More Telugu News