nagababu: నీచంగా ఎన్నో కుతంత్రాలు, కుయుక్తులు చేస్తున్నారు.. ఒక్కొక్కడికీ ఇక ఉంటదీ!: నాగబాబు

  • మీ బాగు కోసం పవన్ తన భవిష్యత్తును వదిలేసుకుని వచ్చాడు
  • కొన్ని పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి
  • కుటుంబాలని నోటి కొచ్చినట్లు తిట్టించి రాజకీయాలు చేస్తున్నారు
  • వీరందరి దుమ్ముదులపడానికి వస్తున్నాడు పవన్ కల్యాణ్‌

'మీ అందరికీ తెలుసు మెగాస్టార్‌ చిరంజీవి మా అందరికీ దారి చూపారు. ఆయనకు ఒకే ఒక మాట చెప్పగలను థ్యాంక్యూ అన్నయ్య' అని సినీనటుడు, నిర్మాత నాగబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన మిలట్రీ మాధవరం గ్రామంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు వ‌క్కంతం వంశీ కాంబినేషన్‌లో వస్తోన్న 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ జరిగింది.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ... "నా తమ్ముడు పెద్ద హీరో.. కానీ, సినిమా ఇండస్ట్రీలో నెంబర్‌ 1 పొజిషన్‌లో ఉండి కోట్ల రూపాయల సంపాదనను కూడా తృణప్రాయంగా వదిలేసి, నిస్వార్థంగా ప్రజల్లోకి వెళుతున్నాడు. ఒకే మాట చెబుతున్నాను.. కొందరు ఎన్నో కుతంత్రాలు, కుయుక్తులు చేస్తున్నారు.. నీచమైన రాజకీయాలు మాపై చేస్తున్నారు. మేము సినిమా ఇండస్ట్రీలో ఉంటే మాత్రం ఎవ్వరూ ఏమనరు.. అయినప్పటికీ పవన్ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చాడు.

అన్ని అడ్డంకులను తొలగించుకుని వచ్చాడు. మీ అందరి బాగు కోసం మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం తన భవిష్యత్తును వదిలేసుకుని మీ ముందుకు వచ్చాడు. కొన్ని పార్టీలు రకరకాల కుటుంబాలని నోటి కొచ్చినట్లు తిట్టించి రాజకీయాలు చేస్తున్నాయి. వీరందరి దుమ్ము దులిపేస్తూ వస్తున్నాడు పవన్ కల్యాణ్‌.. ఒక్కడే అనుకోకండి, అతడి వెనకాల చాలా మంది ఉన్నారు. ప్రజా జీవితంలోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నాం.. ఒకసారి కుదర్లేదు.. ఇప్పుడు కుదురుతుంది.. ఒక్కొక్కడికి ఇక ఉంటదీ.." అంటూ ఆవేశంగా అన్నారు.

More Telugu News