Andhra Pradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు పవిత్ర సంకల్పానికి దైవానుగ్రహం కావాలని కోరుకున్నా: మంత్రి దేవినేని

  • విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో యాగం
  • దేవస్థానం కమిటీ, పూజారులు కలిసి నిర్వహణ
  • ఏపీ సుభిక్షంగా ఉండాలంటూ ఈ యాగం చేశారు
  • అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాన్న దేవినేని

ఏపీ సుభిక్షంగా ఉండాలంటూ విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక యాగం నిర్వహించారు. ఈ యాగంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుర్గామల్లేశ్వర దేవస్థానం కమిటీ, పూజారులు కలిసి ఈ యాగం నిర్వహిస్తుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఏపీ సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరింత శక్తిమంతుడు కావాలని కోరుతూ పంచ దేవతలకు ఈ యాగం చేస్తున్నారని అన్నారు. ప్రజల బాగు కోసం, రాష్ట్రం బాగు కోసం ఈ యాగం చేస్తున్నారని, అంతా శుభం జరగాలని కోరుకుంటున్నానని, ముఖ్యమంత్రి చేస్తున్న పవిత్ర సంకల్పానికి దైవానుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానని దేవినేని అన్నారు.

More Telugu News