samanta: సమంతకి మిర్చి చూపిస్తోన్న నాగచైతన్య.. అలరిస్తున్న భార్యాభర్తల వాణిజ్య ప్రకటన!

  • బిగ్‌బజార్‌ యాడ్‌
  • రూపొందించిన త‌రుణ్ భాస్క‌ర్
  • అలరిస్తోన్న ప్రకటన

సినీనటులు, భార్యాభర్తలు స‌మంత‌, నాగ చైతన్య తొలి సారి ఓ యాడ్‌లో నటించారు. బిగ్ బ‌జార్‌కి సంబంధించిన ఈ యాడ్‌ని పెళ్లి చూపులు సినిమా దర్శకుడు త‌రుణ్ భాస్క‌ర్ రూపొందించాడు. సామగ్రి తెచ్చావా? అంటూ సమంత ఈ యాడ్‌లో తన భర్తని అడుగుతుంది. మిర్చి ఏది? అని సమంత అడగగా మొదట తేలేదని చైతూ చెబుతాడు. దీంతో సమంత చిరు కోపం వ్యక్తం చేస్తూ తన అత్తయ్యకు ఫోనులో ఈ విషయాన్ని చెబుతూ చైతూతో మాట్లాడమని అంటుంది.

దీంతో చైతూ తాను మిర్చి కూడా తెచ్చానని చెబుతాడు. అలరిస్తోన్న ఈ యాడ్‌కు వివేక్ సాగ‌ర్ సంగీతం అందించారు. ప్రస్తుతం చైతూ, సమంతలు తమ తమ సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో ఏం మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల‌లో క‌లిసి న‌టించారు. ఆ తరువాత ఇప్పుడు మళ్లీ ఇలా యాడ్‌లో కనపడ్డారు.    


More Telugu News