Pawan Kalyan: ‘ఏబీఎన్’ వాహనాల ధ్వంసం కేసులో పవన్ కల్యాణ్ అభిమానుల అరెస్టు

  • ఐదుగురిని అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
  • ఉప్పల్, రామంతపూర్, చైతన్యపురి, కూకట్ పల్లికి చెందిన వారిగా గుర్తింపు
  • ఈ దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు

హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ వద్ద ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కు చెందిన ఓబీ వ్యాన్, ఒక కారుపై పవన్ కల్యాణ్ అభిమానులు నిన్న దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడిన నిందితులను బంజారా హిల్స్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఉప్పల్ కు చెందిన భానుప్రసాద్, రామంతపూర్ చెందిన సాయి కిరణ్ రెడ్డి, చైతన్యపురికి చెందిన హరికృష్ణారెడ్డి, కూకట్ పల్లికి చెందిన అంబటి గోపి ఫణీంద్ర, కంటిపూడి రామకృష్ణను అరెస్టు చేశారు.

కాగా, ఈ దాడిని ఖండిస్తూ పలు జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘ఏబీఎన్’ వాహనాలు, ఓ కారుతో పాటు మరికొన్ని వాహనాలను పవన్ అభిమానులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఫిలిం చాంబర్ అద్దాలను కూడా పగల గొట్టారు.  

More Telugu News