Chandrababu: చుక్క నీరు తాగకుండా, కూర్చున్నచోట నుంచి కదలకుండా 12 గంటల పాటు 'ధర్మపోరాట దీక్ష' చేసిన చంద్రబాబు

  • ఏపీ నిరసన జ్వాలలు ఢిల్లీ పాలకులకు తాకేలా దీక్ష
  • మొత్తం 12 గంటల పాటు కొనసాగిన నిరాహార దీక్ష
  • కేంద్ర సర్కారుపై చంద్రబాబు ఉద్యమ శంఖం

ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర సర్కారు చేసిన అన్యాయంపై నిరసన తెలపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 'ధర్మపోరాట దీక్ష' పేరుతో 'నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో ఈ దీక్ష కొనసాగింది. 12 గంటల పాటు చేసిన ఈ 'ధర్మపోరాట దీక్ష' లో ఆయన చుక్క నీరు తాగకుండా, కూర్చున్నచోట నుంచి కదలకుండా ఉండటం గమనార్హం.

More Telugu News