stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 12 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • ఒకే ఒక్క పాయింట్ నష్టపోయిన నిఫ్టీ
  • లాభపడ్డ కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ తదితర సంస్థల షేర్లు

ఈరోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలు చవి చూశాయి. సెన్సెక్స్ 12 పాయింట్లు కోల్పోయి 34,416 పాయింట్ల వద్ద, ఒకేఒక్క పాయింట్ నష్టపోయిన నిఫ్టీ 10,564 పాయింట్ల వద్ద ముగిశాయి. కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడగా, ఎస్బీఐ, టాటా స్టీల్, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ సంస్థల షేర్లు నష్టపోయాయి.

కాగా, ఈ రోజు ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత చాలా సేపు ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే, ఐటీ సంస్థల షేర్లు రాణించడంతో మదుపరులు పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో సూచీ నష్టాలను తగ్గించుకుంది.

More Telugu News