Pawan Kalyan: కలిసిపోయారు.. ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్, అల్లు అర్జున్

  • ఫిలిం ఛాంబర్ లో పవన్ కల్యాణ్, నాగబాబు
  • అక్కడకు వచ్చిన అల్లు అర్జున్
  • ఆప్యాయంగా కౌగిలించుకున్న పవన్

'చెప్పను బ్రదర్' అంటూ గతంలో ఓ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏ సందర్భంలో కూడా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ లు కలవలేదు. ఏ ఫంక్షన్ లోనూ ఇద్దరూ కలసి కనిపించలేదు. ఈరోజు వీరిద్దరినీ మళ్లీ కలిపింది. పవన్ కల్యాణ్, నాగబాబులు ఫిలిం ఛాంబర్ కు చేరుకున్న సమయంలోనే అల్లు అర్జున్ కూడా అక్కడకు వచ్చాడు.

ఈ సందర్భంగా బన్నీని పవన్ కల్యాణ్ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. తన తల్లిని దూషించిన విషయంపై పవన్, నాగబాబులు లాయర్లతో చర్చిస్తున్నారు. ఇది మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయం కావడంతో... అల్లు ఫ్యామిలీ మొత్తం వీరితో కలసి నడవాలని నిర్ణయించింది.

More Telugu News