Pawan Kalyan: న్యాయవాదులతో పవన్ కల్యాణ్, నాగబాబు భేటీ.. ఫిలిం ఛాంబర్ కు చేరుకున్న అల్లు అర్జున్

  • ఫిలిం ఛాంబర్ లో పవన్, నాగబాబు, అల్లు అర్జున్
  • న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న జనసేనాని
  • భారీగా చేరుకుంటున్న అభిమానులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్న నాగబాబుతో కలసి ఫిలింఛాంబర్ చేరుకున్నారు. న్యాయవాదులతో వీరిద్దరూ సమావేశమయ్యారు. తన తల్లిని బహిరంగంగా దూషించిన ఘటనపై ఆయన న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశానికి అల్లు అర్జున్ కూడా వచ్చాడు.

తన తల్లిని బహిరంగంగా దూషించారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం నుంచి ఆయన వరుస ట్వీట్లతో తన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. తన తల్లిని తిట్టించడంలో టీడీపీ బాసులకు టీవీ9 రవిప్రకాశ్, రామ్ గోపాల్ వర్మ, శ్రీసిటీ యజమాని శ్రీని రాజులు సహకరించారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. 

More Telugu News