ipl: నేటి మ్యాచ్ కోసం 'విజిల్ పొడు ఎక్స్ ప్రెస్'లో పూణేకు బయల్దేరిన చెన్నై అభిమానులు

  • ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్
  • మ్యాచ్ వీక్షించే అభిమానుల కోసం చెన్నై నుంచి పూణేకు ప్రత్యేక రైలు
  • ట్రైన్ పేరు విజిల్ పోడ్ ఎక్స్ ప్రెస్

ఐపీఎల్‌ లో భాగంగా నేడు పూణేలో చెన్నై సూపర్‌ కింగ్స్‌-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు చెన్నై నుంచి స్పెషల్ ట్రైన్ బయల్దేరింది. కావేరీ జలాల వివాదం నేపథ్యంలో చెన్నై నుంచి మ్యాచ్ లను పూణేకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూస్తూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఉత్సాహపరిచేందుకు పూణే వెళ్లాలనుకుంటున్నట్టు అభిమానులు జట్టు యాజమాన్యానికి తెలిపారు.

దీంతో జట్టు యాజమాన్యం కేంద్ర రైల్వే శాఖను సంప్రదించి, అభిమానుల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేయించింది. ఈ ట్రైన్ కు ‘విజిల్‌ పోడు ఎక్స్‌ ప్రెస్‌’ అని పేరు కూడా పెట్టారు. ఈ ట్రైన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు పెద్ద సంఖ్యలో పూణే బయల్దేరారు. దీంతో ట్రైన్ సీఎస్కే నినాదాలతో హోరెత్తింది. నేడు ఆ ట్రైన్ పూణే చేరుకుంటుంది. నేటి సాయంత్రం చెన్నై-రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.

More Telugu News