Chandrababu: దుర్గామాత! చంద్రబాబుకు మరింత శక్తిని ప్రసాదించు: మహిళల పూజలు

  • ఇంద్రకీలాద్రిపై దుర్గామాతకు మహిళల పూజలు
  • అమ్మవారి ఆశీస్సులు చంద్రబాబుకు మెండుగా ఉండాలి
  • చంద్రబాబు దీక్ష విజయవంతం కావాలంటూ ప్రత్యేక పూజలు

రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఒక్కరోజు నిరాహారదీక్షకు దిగనున్నారు. ఈ దీక్ష విజయవంతం కావాలని కోరుతూ ఇంద్రకీలాద్రిపై మహిళలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. టీడీపీ మహిళా నాయకురాలు ముళ్లపూడి రేణుక సారధ్యంలో దుర్గామాతకు నిర్వహించిన ఈ పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబుకు దుర్గామాత మరింత శక్తిని ప్రసాదించాలని, ఆశీస్సులు ఉండాలని కోరినట్టు రేణుక పేర్కొన్నారు. ‘మన కోసం’ పేరుతో కొండపైకి వెళ్లిన మహిళలకు ఈవో పద్మ, పాలకమండలి చైర్మన్ సాగర స్వాగతం పలికారు. కాగా, విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చంద్రబాబు దీక్షకు దిగనున్నారు.

More Telugu News