Special Category Status: ప్రత్యేకహోదా కోసం హోటల్ లో దోశలు వేసిన ఎమ్మెల్యే

  • ప్రత్యేకహోదా కోసం నిరసన తెలిపిన ఎమ్మెల్యే
  • దోశలు వేసి నిరసన
  • కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు

 ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యే దోశలు వేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ వివిధ రూపాల్లో ప్రజలు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వంట మాస్టర్ అవతారమెత్తి తన నిరసన తెలిపారు. చిన్న సెంటర్ లోని ఓ హోటల్ లో ఎమ్మెల్యే దోశలు వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. 

More Telugu News