prabhas: ప్రభాస్ కు జోడీగా మరో బాలీవుడ్ హీరోయిన్

  • షూటింగు దశలో 'సాహో' 
  • యాక్షన్ సీన్స్ చిత్రీకరణ 
  • మరో హీరోయిన్ ఖరారు

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు 'అబుదాబి'లో జరుగుతోంది. ప్రభాస్ తదితరులపై భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ప్రభాస్ కాంబినేషన్లోని ఆమె సన్నివేశాలను కొంతవరకూ చిత్రీకరించారు.

ఈ సినిమాలో మరో హీరోయిన్ వుండే అవకాశాలు వున్నట్టుగా కొంతకాలం క్రితం వార్తలు వినిపించాయి. తాజాగా బాలీవుడ్ నుంచి ఎవెలిన్ శర్మను తీసుకున్నట్టు సమాచారం. పలు హిందీ చిత్రాలలో ఈ సుందరి ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తోంది. ఈ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా కనిపించనుందని అంటున్నారు. దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం, ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.        

More Telugu News