samanta: క్రీమ్‌ బన్‌ తింటూ డబ్బింగ్‌ చెప్పుకున్న సమంత ఫొటో

  • తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్న సమంత
  • ఫొటో పోస్ట్ చేసి అలరించిన శామ్
  • విడుదలకు సిద్ధమవుతోన్న 'మహానటి'

దక్షిణాది అగ్ర సినీ నటీమణుల్లో ఒకరిగా ఉన్న సమంత ప్రస్తుతం 'మహానటి' సినిమాలో జర్నలిస్ట్‌ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాను క్రీమ్‌ బన్‌ తింటూ డబ్బింగ్‌ చెబుతోన్న ఫొటోను పోస్ట్ చేసింది. సగం తినేసి ఉన్న బన్నుని ఎడమ చేతితో పట్టుకుని, స్టూడియోలో కూర్చుని సమంత డబ్బింగ్‌ చెబుతున్నట్లు అందులో ఉంది.

'నేను.. నా క్రీమ్ బన్.. మహానటి డబ్బింగ్ పూర్తయింది' అని శామ్ చెప్పింది. కాగా, ఈ సినిమా వచ్చేనెల 9న విడుదల కానుంది. ఈ సినిమాలో సావిత్రిగా నటిస్తోన్న హీరోయిన్‌ కీర్తి సురేష్ కూడా తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. 'మ‌హాన‌టి' టీజర్‌ ఇటీవలే విడుదలైంది. వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

More Telugu News