lalu prasad: లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ నిశ్చితార్థం .. హాజరైన కుటుంబసభ్యులు

  • పాట్నాలోని మౌర్య హోటల్ లో జరిగిన నిశ్చితార్థం
  • ఢిల్లీ, కోల్ కతా నుంచి తీసుకొచ్చిన పువ్వులతో ప్రత్యేక అలంకరణ
  • వచ్చే నెల 12న తేజ్ ప్రతాప్, ఐశ్వర్యా రాయ్ వివాహం

లాలూ ప్రసాద్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు, బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యా రాయ్ కు వివాహ నిశ్చితార్థం జరిగింది. పాట్నాలోని మౌర్య హోటల్ లో ఈరోజు ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాలూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అతిథులు హాజరయ్యారు.

ఈ వేడుక సందర్భంగా ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, పుణే నుంచి తీసుకొచ్చిన పువ్వులతో వేదికను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కాగా, ప్రస్తుతం జైల్లో ఉన్న లాలూ మాత్రం తన తనయుడి నిశ్చితార్థానికి హాజరు కాలేకపోయారు. వచ్చే నెల 12న తేజ్ ప్రతాప్, ఐశ్వర్యా రాయ్ వివాహం పాట్నాలో జరగనుంది. తేజ్ ప్రతాప్ 12వ తరగతి వరకు చదువుకోగా, ఐశ్వర్య ఉన్నత చదువులు చదివింది. ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ గతంలో మంత్రిగా పనిచేశారు.

More Telugu News