nithin: దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కల్యాణం' .. రిలీజ్ డేట్ ఖరారు

  • నితిన్ హీరోగా 'శ్రీనివాస కల్యాణం'
  • కథానాయికలుగా రాశి ఖన్నా .. నందిత శ్వేత 
  • జూలై 24వ తేదీన విడుదల  

దిల్ రాజు నిర్మాణంలో .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ 'శ్రీనివాస కల్యాణం' చేస్తున్నాడు. క్లాస్ ఆడియన్స్ ను .. మాస్ ను .. యూత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, గోదావరి జిల్లాల్లో ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది.

 తాజాగా చండీఘర్ లో రెండవ షెడ్యూల్ షూటింగు మొదలైంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా రాశి ఖన్నా .. మరో కథానాయికగా నందిత శ్వేత నటిస్తున్నారు. జూలై 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ సినిమా సక్సెస్ నితిన్ కి చాలా అవసరం .. ఆ సక్సెస్ కోసమే ఆయన వెయిట్ చేస్తున్నాడు. 

More Telugu News