Renuka Choudary: ఖమ్మంలో మొక్కజొన్న కంకులు అమ్మిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి

  • ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఆదుకునే ఆలోచన
  • ఖమ్మం మార్కెట్ యార్డులో రేణుకా చౌదరి
  • తన వంతుగా లక్ష రూపాయల విరాళం

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మొక్కజొన్న కంకులు, ఇతర పంటలు అమ్మి రూ. 5 లక్షలు సేకరించారు. చేసిన అప్పులు తీర్చలేక, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాల కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ పని చేశారు.

ఆమె చేతిగుండా మొక్కజొన్న కంకులు కొని, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు రూ. 60 వేలు ఇవ్వగా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ రూ. 50 వేలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్ నాయకులు అందించిన సహాయానికి లక్ష రూపాయలను కలిపిన రేణుకా చౌదరి, ఆ మొత్తాన్ని రైతులకు పంచాలని సూచించారు.

More Telugu News