Police: కర్ణాటకలో రూ.100 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • కర్ణాటకలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు
  • చిక్కబళ్లాపూర్‌ జిల్లా తిప్పగానిపల్లిలో ప్రైవేట్‌ బస్సులో డబ్బు
  • దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటాపోటీగా ప్రచారం జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆ రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్‌ జిల్లా తిప్పగానిపల్లి నుంచి వెళుతోన్న ఓ ప్రైవేటు బస్సులో రూ.100 కోట్ల నగదు పట్టుబడడం కలకలం రేపింది. ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టి అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించగా ఓ ప్రైవేటు బస్సులో ఏకంగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరికింది. ఈ నగదు ఎవరిది? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

More Telugu News