kousalya: చివర్లో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా ఛాన్సులు ఇవ్వలేదు .. కారణం అదే అనేవారు: సింగర్ కౌసల్య

  • ఆర్పీ గారు సింగర్ గా నన్ను పరిచయం చేశారు 
  • 'బాచి' నుంచి చక్రి గారి సినిమాలకి పాడాను 
  • ఆ తరువాత ఆయన నుంచి ఛాన్సులు తగ్గాయి

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న కౌసల్య .. తన కెరియర్ గురించిన అనేక విషయాలను ఇలా పంచుకున్నారు. " ఆర్పీ పట్నాయక్ గారు వరుసగా మూడు సినిమాలకు నాతో పాడించారు. ఆ సమయంలో చక్రి గారు 'బాచీ' సినిమా కోసం పిలిపించి .. 'చిత్రం' సినిమాలో 'ఏకాంతవేళ.. ' పాడిన అమ్మాయి అని దర్శకుడు పూరీ జగన్నాథ్ కి పరిచయం చేశారు. 'ఇంకా టెస్ట్ చేయడం ఎందుకూ పాడించేయ్' అంటూ పూరీగారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ సినిమాలో రెండు పాటలు పాడాను.

ఆ తరువాత నుంచి చక్రిగారి ప్రతి సినిమాలోనూ పాడుతూ వచ్చాను. 'నా సినిమాలకి రెగ్యులర్ గా పాడటం నీకు ప్లస్ మాత్రమే కాదు .. మైనస్ కూడా' అని చక్రి అన్నారు. 'నాతో టర్మ్స్ బాగోలేని వాళ్లు నిన్ను పిలవరు' అని చెప్పారు. చక్రిగారు చనిపోవడానికి నాలుగైదు సంవత్సరాల క్రితమే ఆయన నాకు అవకాశాలు ఇవ్వడం తగ్గించారు. నేను అడిగితే 'అంత బడ్జెట్ సినిమా కాదు ఇది .. నీకు తక్కువ ఇచ్చి పాడించడం ఇష్టం లేదు' అని అనేవారు అంటూ చెప్పుకొచ్చారు.  

More Telugu News