dk aruna: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిగ్గుపడే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది: డీకే అరుణ

  • తెలంగాణ సీఎం తన పదవికి రాజీనామా చేయాలి
  • టీఆర్‌ఎస్‌ సర్కారు ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోంది
  • కేసీఆర్‌కి హైకోర్టు అనేకసార్లు మొట్టికాయలు వేసింది
  • కేసీఆర్‌ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిగ్గుపడే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శాసనసభ నుంచి కోమటిరెడ్డి, సంపత్‌ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గున్నా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.

టీఆర్‌ఎస్‌ సర్కారు ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని, అసెంబ్లీలో తమకు ఇష్టం ఉన్న వారినే లోపలికి రానిస్తామనేలా వ్యవహరిస్తోందని డీకే అరుణ అన్నారు. ముఖ్యమంత్రికి అనేక సందర్భాల్లో హైకోర్టు మొట్టికాయలు కొట్టిందని, అయినప్పటికీ ఆయన తీరు మారడం లేదని ఆమె అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. 

More Telugu News