gold: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లపై భారీ ఆఫర్లు

  • ఉచితంగా బంగారం కాయిన్లు, ఈ-గిఫ్ట్ కార్డులు
  • పాత బంగారం మార్చుకునే అవకాశం
  • తయారీ చార్జీలపై రాయితీలు

అక్షయ తృతీయ బంగారం కొనుగోలుకు మంచి శుభదినమనే నమ్మకం చాలా ప్రాంతాల్లో ఉంది. దీన్ని అమ్మకాలకు ఓ చక్కని అవకాశంగా భావించిన కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించాయి.

  • బంగారం, వజ్రాభరణాల తయారీ చార్జీలపై 25 శాతం తగ్గింపును తనిష్క్ ప్రకటించింది. ఈ నెల 18 వరకే ఈ అవకాశం. పాత బంగారాన్ని ఇచ్చి ఎటువంటి తరుగు లేకుండా 100 శాతం ఎక్చేంజ్ చేసుకోవచ్చు.
  • మలబార్ గోల్డ్ రూ.15,000 విలువ చేసే బంగారం ఆభరణాల కొనుగోలుపై ఒక బంగారం కాయిన్ ను ఉచితంగా అందిస్తోంది. ఒకవేళ బిల్లు రూ.30,000 అయితే రెండు బంగారం కాయిన్లు అందుకుంటారు. ఒక్కో కాయిన్ బరువు 150 మిల్లీగ్రాములు. దీనికి అదనంగా కొనుగోలులో 5 శాతం విలువకు సరిపడా గిఫ్ట్ కార్డు లభిస్తుంది. కనీస ఆర్డర్ రూ.15,000 ఉండాలి. తదుపరి కొనుగోలుపై ఈ కార్డును వాడుకోవచ్చు. ఆఫర్లు ఈ నెల 25 వరకు ఉంటాయి.
  • ఇక ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సైతం రూ.19,999 విలువైన ఆభరణాలు కొంటే వజ్రాభరణాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.

More Telugu News