bharath: ఊహాగానాలకు చెక్ చెప్పి.. 'భారత్'కు హీరోయిన్ ను ప్రకటించిన చిత్ర యూనిట్

  • ‘భారత్‌’ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా
  • సల్మాన్, ప్రియాంక జంటగా గతంలో ‘ముఝ్‌ సే షాదీ కరోగే’
  • 2019 రంజాన్ కానుకగా విడుదల కానున్న ‘భారత్‌’

‘భారత్‌’ సినిమాలో హీరోయిన్ ను చిత్రయూనిట్ ప్రకటించింది. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలు తెరకెక్కించిన అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్ బామ్మర్ది అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్న 'భారత్' సినిమాలో భాయ్ కి జోడీగా ఎవరు నటించనున్నారు? అంటూ బీటౌన్‌ లో ఇన్నాళ్లూ ఊహాగానాలు చెలరేగాయి. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్‌ లలో ఒకరు నటిస్తారని పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలో ఇందులో నాయికగా ప్రియాంక చోప్రాను ఎంపికచేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది.

 గతంలో వీరిద్దరూ ‘ముఝ్‌ సే షాదీ కరోగే’ సినిమాలో నటించారు. దేశం కోసం ఒక వ్యక్తి ఏం చేశాడన్న కథ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను 2019 రంజాన్ కానుకగా విడుదల చేయనున్నారు. కథానుగుణంగా ఈ సినిమాను స్పెయిన్‌, పోలాండ్‌, పోర్చుగల్‌, మాల్టా ప్రాంతాల్లో చిత్రీకరించాల్సి ఉండగా, కృష్ణజింకల కేసులో సల్మాన్ బెయిల్ కు పరిమితులు ఉన్న నేపథ్యంలో షూటింగుకు అనుమతి లభిస్తుందా? అన్న విషయంలో సందిగ్ధం నెలకొంది. కాగా, 2014లో వచ్చిన కొరియన్ సినిమా ‘ఓడ్‌ టు మై ఫాదర్’కు రీమేక్ గా దీనిని తెరకెక్కిస్తున్నారు.

More Telugu News