Jagtial District: కొండగట్టు గుట్టపై దారుణం.. తన ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపిన కసాయి తండ్రి

  • ప్రాణాలతో బయటపడిన నిందితుడి భార్య
  • చిన్నారులు అంజలి (2), అఖిత (2) మృతి
  • దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు గుట్టపై దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి వ్యక్తి తన ఇద్దరు పిల్లలకి గుట్టపై ఉరివేసి హత్య చేశాడు. భార్యకు కూడా ఉరి వేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె మాత్రం తప్పించుకుంది. ఈ ఘటనపై అక్కడి వారు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని ఆసిఫాబాద్‌కు చెందిన అశోక్‌గా గుర్తించారు.

వెంటనే అతడి కోసం గాలించి ఓ చోట అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేబట్టారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల పేర్లు అంజలి (2), అఖిత (2) అని తెలిపారు. భార్యపై అనుమానంతోనే అశోక్‌ ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. 

More Telugu News