Mahesh Babu: మహేశ్ మూవీ ప్రమోషన్స్ .. ఒక్క హైదరాబాద్ లోనే 3 కోట్ల ఖర్చు!

  • విడుదల తేదీకి దగ్గరలో 'భరత్ అనే నేను'
  • రేపటి నుంచి ప్రమోషన్స్ లో మహేశ్ 
  • భారీ ఓపెనింగ్స్ ఖాయమనే టాక్

'భరత్ అనే నేను' విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, అభిమానుల్లో మరింతగా కుతూహలం పెరిగిపోతూ వస్తోంది. ఈ సినిమా ప్రచారం కోసం డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీస్థాయిలో ఖర్చు చేస్తున్నట్టుగా సమాచారం. ఒక్క హైదరాబాద్ లోనే హోర్డింగ్స్ ద్వారా ఈ సినిమాకి ప్రచారాన్ని కల్పించడం కోసం 3 కోట్లను కేటాయించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఏ వైపుకి తల తిప్పినా 'భరత్ అనే నేను' సినిమా పోస్టర్స్ కనిపించేలా ప్లాన్ చేశారన్నమాట. మహేశ్ బాబు రేపటి నుంచి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఈ సినిమాకి భారీస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం వలన, ఓపెనింగ్స్ ద్వారా పెద్దమొత్తాన్ని రాబట్టేలా చూస్తున్నారు. ఓపెనింగ్ వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డును సృష్టించడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు. కైరా అద్వాని గ్లామర్ .. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

More Telugu News