BJP: ఉన్నావో రేప్ కేసు... గ్రామంపై దాడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే గూండాలు... ఇద్దరి అదృశ్యంతో మేటర్ సీరియస్!

  • రేప్ విషయంలో మౌనంగా ఉండాలని బెదిరింపు
  • ఆ తరువాత కనిపించకుండా పోయిన ఇద్దరు వ్యక్తులు
  • గాలింపు చేపట్టిన పోలీసులు
  • 7 రోజుల సీబీఐ కస్టడీకి ఎమ్మెల్యే సెంగార్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో రేప్ కేసులో బాధితురాలి బంధువులు ఉన్న ఊరిపై నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ కు చెందిన గూండాలు దాడి చేశారు. ఎమ్మెల్యే మనుషులు తమ గ్రామంపై దాడి చేసి, తమను బెదిరించారని, ఈ కేసు విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడవద్దని హెచ్చరించారని బాధితురాలి మామ మీడియాకు తెలిపారు.

రెండు కార్లలో వచ్చిన గూండాలు దాడి చేసి వెళ్లిన తరువాత ఇద్దరు వ్యక్తులు కనిపించడం లేదని చెప్పారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసును తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు, దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. అదృశ్యమైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

కాగా, సెంగార్ ను ఏడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ, అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ ఆయన్ను విచారిస్తోంది. మరోవైపు బాధిత మహిళను సెంగార్ వద్దకు తీసుకెళ్లిన మహిళను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News