CBI: ఉన్నావో రేప్ కేసు: బాధితురాలిని ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లిన మహిళ అరెస్ట్

  • ఎమ్మెల్యే అత్యాచారం చేస్తున్న సమయంలో బయట కాపలా కాసిన మహిళ
  • శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్న సీబీఐ
  • నిందితుడు బీజేపీ ఎమ్మెల్యేకు ఏడు రోజుల పోలీసు కస్టడీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలిని నమ్మించి మోసం చేసిన ఓ మహిళను తాజాగా సీబీఐ అదుపులోకి తీసుకుంది. నేరం జరిగిన రోజు బాధితురాలిని బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఇంటికి తీసుకెళ్లిన శశి సింగ్ అనే మహిళను సీబీఐ  శనివారం సాయంత్రం అరెస్ట్ చేసింది. కాగా, ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఎమ్మెల్యేకు కోర్టు ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.

ఎమ్మెల్యే తన కుమార్తెపై అత్యాచారం చేస్తున్న సమయంలో శశి సింగ్ గది బయట కాపలా కాసిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత బాలిక తల్లి పేర్కొంది. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను 17 గంటల ఇంటరాగేషన్ అనంతరం శుక్రవారం రాత్రి సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

More Telugu News