Rajamouli: రాజమౌళికి కంగ్రాట్స్ చెప్పిన మహేశ్ బాబు

  • 'బాహుబలి-2'కు దక్కిన మూడు జాతీయ అవార్డులు
  • నిన్ను చూసి గర్విస్తున్నామన్న మహేశ్ బాబు
  • 'బాహుబలి' ఓ ల్యాండ్ మార్క్ అంటూ కితాబు

టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం రాజమౌళికి హీరో మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపాడు. 2018 జాతీయ అవార్డుల్లో 'బాహుబలి-2' సినిమా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మూడు అవార్డులు దక్కాయి.

ఈ నేపథ్యంలో రాజమౌళిపై మహేశ్ ప్రశంసలు కురిపించారు. '2018 జాతీయ అవార్డుల్లో సత్తా చాటినందుకు శుభాకాంక్షలు. భారతీయ సినీ చరిత్రలో 'బాహుబలి' ఓ ల్యాండ్ మార్క్. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు.

మహేశ్ నటించిన 'భరత్ అనే నేను' సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ అవుతోంది. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో త్వరలోనే ఓ మల్టీ స్టారర్ తెరకెక్కనుంది.

More Telugu News