akash puri: 'మెహబూబా' నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది!

  • ఆకాశ్ హీరోగా 'మెహబూబా'
  • కథానాయికగా నేహా శెట్టి 
  • మే 11వ తేదీన రిలీజ్  

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ .. నేహా శెట్టి జంటగా 'మెహబూబా' సినిమా రూపొందింది. యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి వదిలిన పోస్టర్స్ కి .. టీజర్ కి అనూహ్యమైన రీతిలో రెస్పాన్స్ వస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'ఓ ప్రియా .. నా ప్రియా' అనే సాంగ్ ను ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు వదలనున్నారు. సందీప్ చౌతా అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. పూరీ తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమాను, మే 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఆకాశ్ పూరీని హీరోగా ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.  

More Telugu News