kalyan ram: కల్యాణ్ రామ్ జోడిగా నివేదా థామస్ .. షాలినీ పాండే

  • కల్యాణ్ రామ్ నుంచి 'నా నువ్వే'
  • నెక్స్ట్ ప్రాజెక్టును లైన్లో పెట్టిన కల్యాణ్ రామ్
  • దర్శకుడిగా గుహన్

'నా నువ్వే' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి కల్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా తమన్నా నటిస్తోంది. ఈ సినిమా చేస్తూనే కల్యాణ్ రామ్ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్ .. ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.

ఆయన వినిపించిన కథ కొత్తగా .. తాను ఇంతవరకూ చేయనిది కావడంతో కల్యాణ్ రామ్ ఓకే చెప్పేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం కథానాయికలుగా నివేదా థామస్ ను .. షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నారు. ఈ ఇద్దరు కథానాయికలకి కూడా తెలుగులో ఒక రేంజ్ లో క్రేజ్ ఉండటంతో, ఈ ప్రాజెక్టుపై సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి.    

More Telugu News