ipl: ఐపీఎల్ సీజన్-11లో తొలి విజయం నమోదు చేసిన కోహ్లీ సేన

  • ఐపీఎల్ సీజన్-11లో తొలి విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • ఆకట్టుకున్న కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అశ్విన్
  • ధాటిగా ఆడిన డికాక్, డివిలియర్స్

ఐపీఎల్ సీజన్-11లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) హోం గ్రౌండ్ లో విజయం సాధించడం ద్వారా పాయింట్ల ఖాతా తెరిచింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో కేఎల్ రాహుల్ (47), కరుణ్ నాయర్ (29), అశ్విన్ (33) ఆకట్టుకోవడంతో 155 పరుగులు చేసిన పంజాబ్ ఆలౌట్ అయింది.

అనంతరం ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఆర్సీబీ డివిలియర్స్ నిలకడతో సునాయాసంగా విజయం సాధించింది. కీలక దశలో పంజాబ్ బౌలర్లు కోహ్లీ (21), డికాక్ (45), డివిలియర్స్ (57), మన్ దీప్ సింగ్ (22)లను అవుట్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. చివర్లో వాషింగ్టన్ సుందర్ రెండు ఫోర్లు కొట్టి జట్టును గెలిపించాడు. 

More Telugu News