ipl: ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి కింగ్స్ ఎలెవన్ ను బెంబేలెత్తించిన ఉమేష్ యాదవ్

  • బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ 
  • వరుసబంతుల్లో రెండు వికెట్లు తీసిన ఉమేష్
  • చివరి బంతికి యువరాజ్ సింగ్ ను బౌల్డ్ చేసిన ఉమేష్

బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ నిప్పులు చెరిగాడు. నాలుగో ఓవర్ లో మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశాడు. నాలుగో ఓవర్ బౌలింగ్ చేసిన ఉమేష్ యాదవ్, మూడు ఫోర్లతో జోరుమీదున్న పంజాబ్ జట్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (15) ను కీపర్ క్యాచ్ ద్వారా పెవిలియన్‌ కి పంపాడు.

రెండో బంతికి ఆసీస్ హిట్టర్ ఆరోన్‌ ఫించ్‌ ను ఎల్బీడబ్ల్యూగా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ ఓవర్ చివరి బంతికి యువరాజ్‌ సింగ్‌ (4) ను బౌల్డ్ చేశాడు. దీంతో 6 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 50 పరుగులు చేసింది. ధాటిగా ఆడుతున్న లోకేష్ రాహుల్ (23)కి కరుణ్ నాయర్ జత కలిశాడు. 

More Telugu News