akhil akkineni: ఆగలేనన్న అఖిల్.. ముందే చూసేద్దామన్న పూరీ జగన్నాథ్!

  • 'మెహబూబా' ట్రైలర్ అదిరిపోయిందన్న అఖిల్
  • వెయిట్ చేయలేకపోతున్నానంటూ ట్వీట్
  • రిలీజ్ కు ముందే చూసేద్దామన్న పూరీ

తన కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా దర్శకుడు పూరీ జగన్నాథ్ 'మెహబూబా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ జనాల్లోకి దూసుకుపోయింది. అద్భుతమైన విజువల్స్, యుద్ధ వాతావరణం, బుల్లెట్ల లాంటి డైలాగ్స్ సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో హీరో అక్కినేని అఖిల్ ఈ సినిమా ట్రైలర్ పై తన స్పందనను తెలియజేశాడు. 'వాట్ ఏ క్రాకింగ్ ట్రైలర్. నాకు బాగా నచ్చింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. వెయిట్ చేయలేకపోతున్నా. విజువల్స్ అదిరిపోయాయ్. మొత్తం టీమ్ కు ఆల్ ది బెస్ట్.' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు పూరీ జగన్నాథ్ రిప్లై ఇచ్చాడు. 'నీ స్పందనకు ప్రేమాభివందనాలు. రిలీజ్ కంటే ముందే మనిద్దరం కలిసి సినిమా చూద్దాం' అంటూ ట్వీట్ చేశాడు. 

More Telugu News