hyderabad: హైదరాబాదులో ఈరోజు నుంచి 14 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

  • ఎంజీబీఎస్ నుంచి జూబ్లీ బస్టాండ్ వరకు మెట్రో పనులు
  • ట్రాఫిక్ ఆంక్షలను విధించిన పోలీసులు
  • నేటి నుంచి 26వ తేదీ వరకు ఆంక్షలు

ఎంజీబీఎస్ నుంచి సికింద్రాబాదులోని జూబ్లీ బస్టాండ్ వరకు జరుగుతున్న మెట్రో కారిడార్-2 పనుల్లో భాగంగా పిల్లర్ల నిర్మాణం చేపట్టనుండటంతో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్టు ఇన్ ఛార్జ్ పోలీస్ కమిషనర్ చౌహాన్ తెలిపారు. ఈ రోజు నుంచి 26వ తేదీ వరకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ముషీరాబాద్ చౌరస్తా వెళ్లే దారిలో వాహనాలను మళ్లిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రాంతంలో పయనించే వారు కింది సూచనలను పాటించాలి.

  • ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్లేవారు ముషీరాబాద్ చౌరస్తా నుంచి కుడివైపు తిరగాలి. పద్మారావు నగర్ క్రాస్ రోడ్డు, చిలకలగూడ సర్కిల్ మీదుగా సికింద్రాబాద్ చేరుకోవాలి. 
  • కుషాయిగూడ క్రాస్ రోడ్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కు వెళ్లేవారు... ముషీరాబాద్ చౌరస్తా నుంచి పద్మారావు నగర్, చిలకలగూడ క్రాస్ మీదుగా వెళ్లాలి.
  • సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాదు వెళ్లేవారు... యథావిధిగా అదే మార్గంలో పయనించవచ్చు.
  • కవాడిగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లేవారు... మేకలమండి, బోయిగూడ టీ జంక్షన్, గాంధీ ఆసుపత్రి మీదుగా పయనించాలి.
  • ముషీరాబాద్ చౌరస్తాలో వాహనాలను పార్కింగ్ చేయరాదు.

More Telugu News