jagan: మోదీ నిరాహారదీక్షపై జగన్ ట్వీట్!

  • మీరు ఈ రోజు నిరాహారదీక్ష చేపట్టారు
  • ఏపీ ఎంపీలు ఆరు రోజులపాటు దీక్ష చేశారు
  • ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి

పార్లమెంటు సమావేశాలు సక్రమంగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్న తీరును నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క రోజు నిరాహారదీక్షను ఈ రోజు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు.

'నరేంద్ర మోదీగారు... మీరు ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా రాని కారణంగా... 6 రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టిన ఐదుగురు ఏపీ ఎంపీలు ఆసుపత్రిలో ఉన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకలను దయచేసి వినండి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి' అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News