Prime Minister: మోదీ చెన్నై పర్యటనను నిరసిస్తూ యువకుడి ఆత్మహత్య

  • డిఫెన్స్ ఎక్స్ పోలో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్న ప్రధాని
  • నిరసనగా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ధర్మలింగం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటనను నిరసిస్తూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. కావేరీ జలవివాదం నేపథ్యంలో గత కొంత కాలంగా తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిఫెన్స్ ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చెన్నై చేరుకున్నారు.

ఆయన పర్యటనను నిరసిస్తూ, కావేరీ జలవివాదంపై కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఈరోడ్ కు చెందిన ధర్మలింగం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ విషయం తన ఇంటి గోడపై రాసి నేటి ఉదయం 9 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటల్లో ఆహుతవుతున్న ధర్మలింగాన్ని చూసిన ఇరుగుపొరుగువారు మంటలార్పి ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. దీంతో తమిళనాట ఆందోళనలు మిన్నంటాయి.

More Telugu News