nagachaitanya: స్టీల్ ఫ్యాక్టరీలో రౌడీలను చితగ్గొట్టేస్తోన్న చైతూ!

  • షూటింగు దశలో 'సవ్యసాచి'
  • యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ 
  • జూన్ 14వ తేదీన రిలీజ్

మొదటి నుంచి కూడా చందూ మొండేటి ఒక్కో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక్కో సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు. అలా ఆయన సక్సెస్ ల తో పాటు యూత్ నుంచి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన నాగచైతన్యతో 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు 'తూప్రాన్' స్టీల్ ఫ్యాక్టరీలో జరుగుతోంది.

రామ్ - లక్ష్మణ్ డిజైన్ చేసిన ఒక వెరైటీ యాక్షన్ ఎపిసోడ్ ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారట. 'సవ్యసాచి' టైటిల్ కి తగినట్టుగా చైతూ చేసే ఫైట్ ఇదేనని చెబుతున్నారు. ఈ యాక్షన్ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, మాధవన్ .. భూమిక కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. థ్రిల్లర్ జోనర్లో రూపొందుతోన్న ఈ సినిమాను జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నారు.     

More Telugu News