xiaomi: చంద్రబాబును కలిసిన ప్రముఖ మొబైల్స్ సంస్థ ప్రతినిధులు

  • భేటీకి హాజరైన లోకేష్, అమర్ నాథ్ రెడ్డి
  • రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న షియోమీ
  • పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన లోకేష్

ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అమరావతిలో ఈ ఉదయం సీఎంతో భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ, తిరుపతి ఈఎంసీ-2 ప్రాంతాల్లో షియోమీ పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. రూ. 4వేల కోట్ల పెట్టుబడితో ఏపీలో సెల్ ఫోన్ల తయారీ పరిశ్రమను శ్రీ సిటీ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఏపీ మంత్రులు నారా లోకేష్, అమర్ నాథ్ రెడ్డిలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను షియోమీ ప్రతినిధులకు నారా లోకేష్ వివరించారు. 

More Telugu News