ashok gajapati raj: అశోక్ గజపతిరాజుకి ఎయిర్ ఇండియా సిబ్బంది షాక్!

  • ఎయిర్ ఇండియా విమానంలో విశాఖకు వెళ్లిన అశోక్ గజపతిరాజు
  • లగేజ్ లేకపోవడంతో ఆశ్చర్యపోయిన మాజీ మంత్రి
  • లగేజీని ఢిల్లీ విమానాశ్రయంలోనే వదిలేసిన సిబ్బంది

విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ నుంచి విశాఖపట్టణం వచ్చేందుకు ఈ రోజు ఆయన ఎయిర్ ఇండియా విమానం ఎక్కేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు. విశాఖపట్నం చేరుకున్న తర్వాత తన లగేజ్ లేకపోవడంతో ఆయన ఆశ్చర్యపోయినట్టు ఓ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, ఢిల్లీలో ఆయన లగేజీని తనిఖీ చేసిన విమానాశ్రయ సిబ్బంది, దానిని అక్కడే వదిలేసినట్టు తెలుస్తోంది.
 

More Telugu News