Tollywood: మాటల్లేవ్.. పూరి తనయుడి సినిమా ట్రైలర్‌పై చార్మి ఎమోషనల్ ట్వీట్

  • రెండు గంటల్లోనే 5 లక్షల వ్యూస్ సాధించిన ‘మెహబూబా’ ట్రైలర్
  • ‘నో వర్డ్స్.. హ్యాపీ టియర్స్’ అంటూ చార్మీ ట్వీట్
  • ఆకట్టుకుంటున్న యుద్ధ సన్నివేశాలు

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, నేహ శెట్టి జంటగా తెరకెక్కుతున్న ‘మెహబూబా’ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌లోని యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైన రెండు గంటల్లోనే 5 లక్షల వ్యూస్ సాధించింది. దీంతో పూరి కనెక్ట్స్ వ్యవహారాలు చూసుకునే నటి చార్మి స్పందించింది. రెండు గంటల్లోనే 5 లక్షల వ్యూస్ వచ్చిన విషయాన్ని పోస్టర్‌పై రాసి ‘మాటల్లేవ్.. ఆనంద బాష్పాలే’ అని ట్వీట్ చేసింది.

తాజాగా విడుదలైన ‘మెహబూబా’ ట్రైలర్‌లో ‘దేశాన్ని ప్రేమించే మనసు సైనికుడికి మాత్రమే ఉంటుంది. ఆ మనసులో చిన్న స్థానం దొరికినా చాలు, మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం’ అన్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

More Telugu News