jdu: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలి: జేడీయూ

  • రేపు బీహార్‌కి మోదీ
  • 'చంపారన్‌' 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకకు ప్రధాని 
  • హోదా డిమాండ్ చేస్తోన్న జేడీయూ

గత ఎన్నికల్లో తమ రాష్ట్రానికి ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం బీహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని జేడీయూ ప్రధాన కార్యదర్శి షాయం రజాక్‌ డిమాండ్‌ చేశారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లోని మోతిహరిలో పర్యటించనున్న నేపథ్యంలో జేడీయూ నేతలు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నారు. ఏపీలో ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తోన్న నేపథ్యంలో బీహార్‌లోనూ ఈ డిమాండ్‌ ఊపందుకుంటోంది. కాగా, చంపారన్‌ సత్యాగ్రహం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తోన్న ముగింపు వేడుకలో పాల్గొనేందుకు మోదీ బీహార్‌కు వెళ్లనున్నారు. 

More Telugu News