saidharam tej: సాయిధరమ్ తేజ్ తో ఆడిపాడనున్న మేఘ ఆకాశ్

  • 'ఛల్ మోహన్ రంగ'తో ఆకట్టుకున్న మేఘ ఆకాశ్
  • కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఛాన్స్ 
  • హీరోగా సాయిధరమ్ తేజ్  

కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురుకావడంతో, సాధ్యమైనంత త్వరగా హిట్ కొట్టాలనే పట్టుదలతో సాయిధరమ్ తేజ్ వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా, తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు.

ఈ సినిమా తరువాత ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా మేఘ ఆకాశ్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. 'ఛల్ మోహన్ రంగ' సినిమాతో గ్లామర్ పరంగాను .. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ కారణంగానే ఆమెకి కిషోర్ తిరుమల సినిమాలో అవకాశం లభించినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే ఈ సినిమా రూపొందనుండటం విశేషం.  

More Telugu News