nagashourya: ఆసక్తిని రేపుతోన్న టైటిల్ 'సైంధవ' .. హీరోగా నాగశౌర్య!

  • 'ఛలో' హిట్ తో నాగశౌర్య 
  • కొత్త దర్శకుడితో నెక్స్ట్ మూవీ 
  • త్వరలో పూర్తి వివరాలు  

'ఛలో' సినిమాతో హిట్ కొట్టేసిన నాగశౌర్య .. యూత్ లో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ఆయనకి అవకాశాల సంఖ్య కూడా పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన ఓ కొత్త దర్శకుడు వినిపించిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి ఇంకా కథానాయిక ఎవరనే విషయం అనుకోలేదు. టైటిల్ మాత్రం 'సైంధవ' అనేసుకున్నారు.

'సైంధవుడు' అనే పాత్ర మనకి 'మహాభారతం'లో కనిపిస్తుంది. ద్రౌపది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 'సైంధవుడు' .. పాండవులు ప్రాణభిక్ష పెట్టడంతో బయటపడతాడు. ఆ కసితో ఆయన అభిమన్యుడి మరణానికి కారకుడవుతాడు. అలా సైంధవుడి పాత్ర కనిపిస్తుంది. ఈ సినిమా కథ ఎలా వుంటుందో తెలియదుగానీ .. టైటిల్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.     

More Telugu News