venkatesh: 'రంగమ్మత్త'గా జోరు .. మల్టీ స్టారర్ లో ప్లేసు

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీ స్టారర్ 
  • హీరోలుగా వెంకీ .. వరుణ్ తేజ్ 
  • మే నుంచి రెగ్యులర్ షూటింగ్

'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త' పాత్ర అనసూయకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత అంతా ఆమెను 'రంగమ్మత్త'అనే పిలుస్తున్నారు. అంతగా ఈ పాత్రతో ఆమె ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఈ సినిమా తరువాత అనసూయను వెతుక్కుంటూ చాలా అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు.

అలాంటి సినిమాలలో మల్టీస్టారర్ కూడా ఉందని అంటున్నారు. అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా ఈ సినిమా పట్టాలెక్కనుంది. మే నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర ఉండటంతో, ఆ పాత్ర కోసం అనసూయను సంప్రదించారట. వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.       

More Telugu News