Train Accident: రైలు ఇంజన్ అమర్చారు, బ్రేక్ లింక్ కలపలేదు... 17 కిలోమీటర్లు వెళ్లిపోయిన బోగీలు!

  • తప్పిన పెను ప్రమాదం
  • టిట్లాగఢ్ సమీపంలో ఘటన
  • ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్

ఒడిశాలో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఇంజన్ లేకుండా పూరీ - అహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 22 బోగీలు 17 కిలోమీటర్లు ప్రయాణించాయి. టిట్లాగఢ్ వద్ద రైలు ఇంజన్ ను మారుస్తున్న సమయంలో బ్రేక్ లింక్ ను కలపకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మార్గమధ్యంలో లింక్ తెగి, బోగీలు లేకుండా ఇంజన్ వెళ్లిపోగా ఆపై కేసింగా వైపు బోగీలు వెళ్లాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఆఘమేఘాలపై స్పందించి ఆ మార్గంలో మరే ఇతర రైలూ రాకుండా ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. కేసింగా సమీపంలో బోగీలు ఆగిపోగా, మరో ఇంజన్ ను అమర్చి టిట్లాగఢ్ కు తీసుకెళ్లారు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని తేల్చిన ఉన్నతాధికారులు, విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ముగ్గురిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు.

More Telugu News