Hyderabad: భారీగా పట్టుబడ్డ మందుబాబులు... ఒక్క బంజారాహిల్స్ లోనే ఏకంగా 151 మందిపై కేసులు!

  • శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
  • 46 కార్లు, 103 బైక్ లు సీజ్
  • గతంలో పట్టుబడిన వారే అధికం

గత రాత్రి హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని గత ఐదేళ్లుగా పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తూ, వారాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేస్తున్నప్పటికీ, మందు బాబులు మారడం లేదు. ఇటీవలి కాలంలో పట్టుబడుతున్న వారి సంఖ్య తగ్గుతూ రాగా, శనివారం నాడు ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. మొత్తం 151 మంది మందు కొట్టి తమ వాహనాలను రోడ్లపైకి తేవడాన్ని చూసిన పోలీసులే ఆశ్చర్యపోయారు. మొత్తం 46 కార్లు, 103 బైక్, లు, రెండు ఆటోలను సీజ్ చేశామని, పట్టుబడిన వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి, కోర్టులో హాజరు పరచనున్నామని తెలిపారు. వీరిలో పలువురు గతంలో పట్టుబడిన వారేనని పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News