tenali: తెనాలిలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఘర్షణ

  • జగన్ ప్రసంగించిన ప్రాంతాన్ని కర్పూరంతో కడిగిన టీడీపీ నాయకులు
  • వారిని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
  • ‘మా నాయకుడిని అవమానిస్తారా?’ అంటూ వైసీపీ ఆగ్రహం
  • ఇరువర్గాల మధ్య ఘర్షణ..సర్దిచెప్పిన పోలీసులు

గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత జగన్ బహిరంగ సభ ఈరోజు సాయంత్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ సభ ముగిసిన అనంతరం జగన్ ప్రసంగించిన ప్రదేశాన్నికర్పూరం వెలిగించి టీడీపీ నాయకులు శుద్ధి చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ‘మా నాయకుడిని అవమానిస్తారా?’ అంటూ వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు.

More Telugu News