Mahesh Babu: ‘భరత్ బహిరంగ సభకు ప్రేమతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్’.. పోస్టర్ విడుదల

  • ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరుకానున్న ఎన్టీఆర్
  • అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్
  • ‘భరత్ బహిరంగ సభ’ నమూనాను గ్రాఫిక్స్ లో చూపించిన వైనం

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన ‘భరత్ అనే నేను’ సినిమా ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో రేపు సాయంత్రం జరగనుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ‘భరత్ బహిరంగ సభ’ అంటూ ట్వీట్ చేసిన చిత్ర యూనిట్, భరత్ బహిరంగ సభ నమూనాను గ్రాఫిక్స్ రూపంలో చూపింది. 

కాగా, ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ముఖ్యఅతిథులుగా వస్తారనే వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే హాజరవుతున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. ‘భరత్ బహిరంగ సభకు ప్రేమతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్’ అని రాసి ఉన్న ఆ పోస్టర్ లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ చిరునవ్వులు చిందిస్తున్నారు.

More Telugu News