ys rajashekar reddy: వైఎస్ రాజశేఖరెడ్డిపై బయోపిక్ .. ‘యాత్ర’ లోగో విడుదల

  • ఈ చిత్రం టైటిల్ లోగో అధికారికంగా విడుదల
  • ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న షూటింగ్
  • ‘యాత్ర’లో ప్రధానపాత్ర పోషించనున్న హీరో మమ్ముట్టి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. దక్షిణాది నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పేరు ‘యాత్ర’. ఈ చిత్రం టైటిల్ లోగోను అధికారికంగా ఈరోజు విడుదల చేశారు. ‘యాత్ర’ టైటిల్ కు ‘కడప దాటి గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడవాలనుంది. మీ గుండెచప్పుడు వినాలనుంది’ అనేది ట్యాగ్ లైన్ గా ఉంది.

70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్న ‘యాత్ర’కు రచన, దర్శకత్వం మహీ వీ రాఘవ్. ఈ నెల 9 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, ‘పాఠశాల’, ‘ఆనందో బ్రహ్మో’ చిత్రాలకు మహీ వి రాఘవ్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా,  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించనున్న హీరో మమ్ముట్టి కూడా ఓ పోస్ట్ చేశారు. ‘తెలుగులో నేను నటించనున్న కొత్త చిత్రం ‘యాత్ర’ ధీమ్ పోస్టర్’ అని మమ్ముట్టి  పేర్కొన్నారు.

More Telugu News