Allu Arjun: ఆ గ్రామం ప్రత్యేకత అది .. అందుకే అక్కడికి వెళుతోన్న బన్నీ

  • మిలటరీ మాధవరం గ్రామానికి అల్లు అర్జున్ 
  • అక్కడి ఆర్మీ కుటుంబాలతో మాటామంతీ
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 29వ తేదీన                 

అల్లు అర్జున్ అభిమానులంతా 'నా పేరు సూర్య' సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మే 4ను విడుదల తేదీగా ఖరారు చేసుకున్నారు. ఈ లోగా అభిమానులలో ఆనందోత్సాహాలను నింపడంకోసం, ఈ నెల 29వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ - గచ్చిబౌలిలోని క్రికెట్ స్టేడియం ఈ వేడుకకు వేదికగా మారనుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర అల్లు అర్జున్ ను ఎంతగానో ప్రభావితం చేసిందని అంటున్నారు. ఈ కారణంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని 'మిలటరీ మాధవరం' అనే గ్రామానికి ఈ నెల 22వ తేదీన వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరు ఆర్మీలో  పనిచేస్తున్నారు. అందుకే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని అంటారు. అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి మిలటరీ కుటుంబాలను కలిసి ముచ్చటించనున్నట్టు చెబుతున్నారు.               

More Telugu News